Ashok Gajapathi Raju and Sujana Chowdary quit Modi Cabinet

  • 6 years ago
Chandrababu Naidu's two ministers in the central government are resigned, but the BJP's two ministers in the Andhra Pradesh Chief Minister's state cabinet have quit this morning.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రాజీనామాల అనంతరం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.

తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు వారితో చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన ఎంపీలకు సూచించారు.

కాగా, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయడానికి ముందు లోకసభ, రాజ్యసభల్లో మాట్లాడే అవకాశముంది. లోకసభలో రూల్ నెంబర్ 357, రాజ్యసభలో రూల్ నెంబర్ 241 ప్రకారం వారు మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాజీనామా సమర్పించనున్నారు.

Recommended