IPL 2018: Teams Create A Unique Record For The First Time In 11 years
- 6 years ago
As IPL 2018 heads towards the business end of the tournament, the IPL Points Table makes for very interesting reading, with the top two sides – Chennai Super Kings (CSK) and SunRisers Hyderabad looking really good to stay on top of the Points Table.
#IPL2018
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#PLayoffs
ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ లీగ్ దశ ముగిసింది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. క్వాలిఫయిర్-1 మ్యాచ్లో భాగంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్లో పాల్గొన్న అన్ని జట్లు ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాయి. ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి అన్ని జట్లు లీగ్ దశలో 10 పాయింట్లు సాధించాయి. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
అంతేకాదు ఈ సీజన్లో చాలా వరకు మ్యాచ్లు చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫలితాన్ని వచ్చేలా జరిగాయి. ఈ సీజన్లో మరో విశేషం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఏ జట్టు కూడా సూపర్ ఓవర్ ఆడకపోవడం. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు ముందు వరకు మొత్తం 56 మ్యాచ్లు జరిగాయి.
వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్ల్లో కూడా సూపర్ ఓవర్ ఆడలేదు. ఐపీఎల్ 11వ సీజన్ను ఎంతో ఘనంగా ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంతో ముగించింది. టోర్నీలో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. అనంతరం క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా కోల్కతాలోనే జరగనుంది. ఇక, పైనల్ మ్యాచ్ ఆదివారం (మే 27)న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.
#IPL2018
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#PLayoffs
ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ లీగ్ దశ ముగిసింది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. క్వాలిఫయిర్-1 మ్యాచ్లో భాగంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్లో పాల్గొన్న అన్ని జట్లు ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాయి. ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి అన్ని జట్లు లీగ్ దశలో 10 పాయింట్లు సాధించాయి. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
అంతేకాదు ఈ సీజన్లో చాలా వరకు మ్యాచ్లు చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఫలితాన్ని వచ్చేలా జరిగాయి. ఈ సీజన్లో మరో విశేషం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఏ జట్టు కూడా సూపర్ ఓవర్ ఆడకపోవడం. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు ముందు వరకు మొత్తం 56 మ్యాచ్లు జరిగాయి.
వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్ల్లో కూడా సూపర్ ఓవర్ ఆడలేదు. ఐపీఎల్ 11వ సీజన్ను ఎంతో ఘనంగా ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏడో స్థానంతో ముగించింది. టోర్నీలో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. అనంతరం క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా కోల్కతాలోనే జరగనుంది. ఇక, పైనల్ మ్యాచ్ ఆదివారం (మే 27)న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.